Road Accident : పల్నాడు లో ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడులో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడిపోయింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పల్నాడులో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20మందికి తీవ్ర‌గాయాలైన అయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు గుర్తించారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న సమయంలోనే బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.