వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం…!

వినేష్ ఫోగాట్ పై ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడటం పట్ల ఇప్పుడు దేశ వ్యాప్తంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవమానంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - August 8, 2024 / 07:48 AM IST

వినేష్ ఫోగాట్ పై ఒలంపిక్స్ లో అనర్హత వేటు పడటం పట్ల ఇప్పుడు దేశ వ్యాప్తంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో ఆమెను ఒలంపిక్స్ నుంచి పంపించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆమె ప్యారిస్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ అవమానం తో ఆమె కుస్తీ పోటీలకు రిటైర్మెంట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టింది. “నేను కుస్తీలో గెలిచాను, కానీ కుస్తిపై ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం అంతా భగ్నమైంది, ఇంతకంటే బలం నాకు లేదు. కుస్తీకి వీడ్కోలు పలుకుతున్నాను 2001-2024 . మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, క్షమించండి” అంటూ ఆమె పోస్ట్ చేసింది. దాదాపు 23 ఏళ్ళ పాటు కుస్తీ పోటీల్లో పాల్గొంది వినేష్. ఆమె జీవిత కథ ఆధారంగా దంగల్ అనే సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే.