నవంబర్‌లో పెళ్లి.. ఆ రాత్రి ఎన్నో ముచ్చట్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న కోల్‌కతా డాక్టర్ ప్రేమకథ..

కోల్‌కతా ఆర్జీ మెడికల్ కాలేజ్ డాక్టర్‌ హత్యాచార ఉదంతం.. దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత దారుణానికి పాల్పడిన దుర్మార్గుడిని.. కఠినంగా శిక్షించాలని దేశమంతా రోడ్డెక్కింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 06:31 PM IST

కోల్‌కతా ఆర్జీ మెడికల్ కాలేజ్ డాక్టర్‌ హత్యాచార ఉదంతం.. దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత దారుణానికి పాల్పడిన దుర్మార్గుడిని.. కఠినంగా శిక్షించాలని దేశమంతా రోడ్డెక్కింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది. కావాలని ఆమెను టార్గెట్ చేసి చంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఇక అటు రంగంలోకి దిగిన సీబీఐ.. ప్రతీ ఒక్కరిని విచారిస్తోంది. నిందితుడు సంజయ్‌.. కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌కు పాలీగ్రాఫ్‌ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.

ఇక చనిపోయిన ట్రైనీ డాక్టర్‌ లైఫ్‌కు సంబంధించిన ప్రతీ విషయం.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొత్త చర్చకు కారణం అవుతోంది. పీజీలో గోల్డ్‌మెడల్ సాధించాలనే లక్ష్యంతో.. రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడేదని.. డాక్టర్ పేరెంట్స్ చెప్తున్న మాటలు.. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయ్. ఐతే ఇప్పుడు ఆ ట్రైనీ డాక్టర్‌ లవ్‌స్టోరీ.. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎంబీబీస్ కోచింగ్‌ సెంటర్‌లో… 12ఏళ్ల కింద ఈ ట్రైనీ డాక్టర్‌కు పరిచయం అయింది. పరిచయం ఫ్రెండ్షిప్‌గా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి.. ఈ నవంబర్‌లో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు.

హత్యాచారం జరిగిన ముందు రోజు.. అంటే ఆగస్ట్‌ 8న రాత్రి పదకొండున్నర వరకు వాళ్లిద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఐతే ఆ రాత్రి ఇద్దరి జీవితాలను మార్చేసింది. ప్రేమకథను ఛిద్రం చేసింది. ఆగస్ట్‌ 9న డాక్టర్‌కు ఆ అబ్బాయి ఫోన్ చేస్తే.. రెస్పాన్స్ రాలేదు. పనిలో బిజీగా ఉందని చెప్పి.. డిస్టర్బ్ చేయొద్దని సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాతే ఈ ఘోరం గురించి అతనికి తెలిసింది. ఆర్జీ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ డాక్టర్‌ స్నేహితుడి ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయింది. బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి పరుగులు పెట్టాడు.

ఐతే డాక్టర్ డెడ్‌బాడీ దగ్గరికి వెళ్లేందుకు, చూసేందుకు.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సంఘటనా స్థలానికి కొద్దిదూరంలో కూలిపోయి.. ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 13ఏళ్లుగా తనతో పాటు నడిచి.. తన చేయి పట్టుకొని నడిచిన స్నేహితురాలు ఇక లేదని తెలిసి.. ఆ యువకుడు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇంతలా ప్రేమించుకొని.. త్వరలో పెళ్లి చేసుకుందామనుకున్న ట్రైనీ డాక్టర్‌ది సూసైడ్ అని మొదట్లో చెప్పడం దారుణం అంటూ.. ఇద్దరి ప్రేమ కథ గురించి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ కోరాలో ప్రిషు అనే యువకుడు పోస్ట్ చేశాడు. ఇది ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇన్ని కలలు కన్న ఓ యువ డాక్టర్‌ బతుకును, ఆ యువకుడి భవిష్యత్‌ను నాశనం చేసింది ఎవరైనా సరే.. ఉరి తీయాల్సిందేనని.. ఈ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.