ALLU ARJUN MISS : అల్లు అర్జున్ ఎక్కడ ? పవన్ సెలబ్రేషన్స్ కి ఆ ఫ్యామిలీ డుమ్మా

పిఠాపురంలో అనూహ్య విజయం... జనసేనలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ రేట్... ఈ రెండు హిస్టారికల్ మూవ్ మెంట్స్ తో మెగాస్టార్ ఇంట్లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కి అడుగడుగునా నీరాజనాలు.

పిఠాపురంలో అనూహ్య విజయం… జనసేనలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ రేట్… ఈ రెండు హిస్టారికల్ మూవ్ మెంట్స్ తో మెగాస్టార్ ఇంట్లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కి అడుగడుగునా నీరాజనాలు. అమ్మ, అన్నయ్య,వదినలకు పవర్ స్టార్ శిరస్సు వంచి పాదాభివందనం చేయడంతో కుటుంబ సభ్యులే కాదు… పవన్ అభిమానులు, జనసైనికులు సంతోషంతో మురిసిపోయారు. తల్లి అంజనమ్మ దిష్టి తీసింది. వదిన సురేఖ హారతి పట్టింది. అన్నయ్య చిరంజీవి భారీ పూలమాలను పవన్ మెడలో వేశాడు. పవన్ కల్యాణ్ తో కేక్ కట్ చేయించారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఆ విన్నింగ్ సెలబ్రేషన్స్ చూసి భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకోని వాళ్ళు లేరని చెప్పవచ్చు.

చిరంజీవి ఇంట్లో ఇంత గ్రాండ్ గా జరిగిన పవన్ కల్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ అక్కా చెల్లెళ్ళతో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ, రాంచరణ్ ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎవరూ మిస్ కాలేదు. కానీ ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా పాల్గొనలేదు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, ఆయన భార్య కూడా డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసింది. చిరంజీవి వీడియో సందేశం ఇస్తే… మిగతా కుటుంబ సభ్యులు స్వయంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇదే టైమ్ లో బన్నీ మాత్రం నంద్యాలకు భార్యతో కలసి స్వయంగా వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చాడు. పవన్ కి ఒక్క ట్వీట్ తో సరిపెట్టాడు.

దీనిపై వివాదం చెలరేగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ని ఉద్దేశించి పరాయివాడు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కాంట్రోవర్సీగా మారింది. గత కొన్నేళ్ళుగా మెగాస్టార్ నీడలో కాకుండా… అల్లు ఇమేజ్ తోనే ఎదగాలని అర్జున్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పిఠాపురం విషయంలో నాగబాబు ట్వీట్ తర్వాత మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగింది. పవన్ గెలిచిన తర్వాత… అభినందనలు చెబుతూ అల్లు అర్జున్ మొన్నీ మధ్యే ట్వీట్ చేశాడు. సో.. ఇక మెగా – అల్లు మధ్య మంచి రిలేషన్ ఉంటుందని అభిమానులు భావించారు. కానీ చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ కి అల్లు అరవింద్ కూడా రాకపోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. పరాయివాడు అంటూ నాగబాబు పెట్టిన పోస్ట్… అల్లు అర్జున్ తో పాటు అరవింద్ ని కూడా హర్ట్ చేసిందా ? అందుకే ఈ ప్రోగ్రామ్ కి రాలేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అయినా మెగా-అల్లు ఫ్యామిలీలు కలుస్తాయా … ఇలాగే వివాదాలు కంటిన్యూ అవుతాయా అన్నది చూడాలి.