Puri ram : పూరీ అంత టైమ్ ఎందుకు తీసుకుంటున్నాడు..?

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Smart) .. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు (Smart Shankar) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Smart) .. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు (Smart Shankar) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే.. ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఇటు పూరికి, అటు రామ్‌కు హిట్లు లేకపోవడంతో… డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ ఇద్దరికీ చాలా అవసరంగా మారింది. దీంతో.. ఈ మూవీకి పూరీ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా పూరీ జగన్నాధ్ తన సినిమాలకు చాలా తక్కువ సమయం తీసుకుంటాడు. కానీ.. డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడుతున్నాడు. నిజానికి లైగర్‌ సినిమా పూరీకి అట్టర్ ప్లాప్ ను మిగిల్చింది. అటు.. రామ్‌కు కూడా వారియర్, స్కంద డిజాస్టర్లుగా మిగలగా.. రెడ్ యావరేజ్‌ రిజల్ట్‌గా మిగిలింది. దీంతో.. డబుల్ ఇస్మార్ట్ తో బౌన్స్‌ బ్యాక్ అవ్వాలని ఇద్దరూ కసిగా ఉన్నారు. దీంతో.. ‘డబుల్ ఇస్మార్ట్’కు పూరి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. నిజానికి మార్చిలోనే ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కావాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత వేసవి చివర్లో అన్నారు. అది కూడా సాధ్యపడట్లేదట.. మేలో కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు.

ఓ వైపు ఐపీఎల్ (IPL) , మరో వైపు ఎన్నికల హడావిడి ఉండడంతో పూరీని తన సినిమాను జూన్ నెలకు వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది.. ఆ నెల మధ్యలో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజవుతుందని అంటున్నారు. సినిమా ఇప్పటికే 75 శాతం దాకా పూర్తయిందంటున్నారు. పెద్ద హిట్ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల దీనిపై ముందు నుంచే హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగ్గట్లుగానే పూరీ అంతా ప్లాన్ చేసుకుంటున్నాడట.. పూరితో కలిసి ఛార్మి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పూరి, రామ్ ఇద్దరికీ గ్రాండ్ హిట్ ఇవ్వడం ఖాయమంటున్నారు కామన్ ఫ్యాన్స్..