YS VIJAYAMMA: అమెరికా నుంచి విజయమ్మ సందేశం.. ఎమోషనల్ అయిన షర్మిల..

ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన షర్మిల.. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక అటు షర్మిలకు విషెస్ చెప్తూ అమెరికా నుంచి ఆమె కుమారుడు, కూతురు, కోడలు.. తల్లి విజయమ్మ విషెస్‌ చెప్తూ ఫొటోలు పంపించారు

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 02:13 PM IST

YS VIJAYAMMA: ఏపీ రాజకీయ యుద్ధంలో అసలైన ఘట్టం మొదలైంది. నామినేషన్ల పర్వం పండగలా సాగుతోంది. కీలక నేతలంతా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశాలు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన షర్మిల.. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పించారు.

TDP REBELS : ఉత్తరాంధ్ర టీడీపీలో రెబల్స్ టెన్షన్… పడిపోతున్న తెలుగుదేశం గ్రాఫ్

ఇక అటు షర్మిలకు విషెస్ చెప్తూ అమెరికా నుంచి ఆమె కుమారుడు, కూతురు, కోడలు.. తల్లి విజయమ్మ విషెస్‌ చెప్తూ ఫొటోలు పంపించారు. వాటిని షేర్ చేసిన షర్మిల.. ఎమోషనల్ అయ్యారు. ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సందర్భంలో.. దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కోసం, విజయం వైపు అడుగు వేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డిని మరిచిపోలేని జనాలు.. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని.. ధర్మం వైపే మన కడప జనాలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ.. ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఓ వైపు కొడుకు, మరోవైపు కూతురు ప్రచారం మొదలుపెట్టడానికి ముందు.. ఇద్దరినీ ఆశీర్వదించిన విజయమ్మ.. సరిగ్గా ఎన్నికల సమయానికి అమెరికాలో మనవడి దగ్గరికి వెళ్లిపోయారు.

విజయమ్మ అమెరికా వెళ్లడంపై.. రాజకీయంగానూ రచ్చ జరిగింది. జగన్‌కు భయపడే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారని.. టీడీపీ విమర్శల వర్షం గుప్పించింది. ఐతే అటు కూతురు, ఇటు కొడుకు.. ఎవరి వైపు ఉన్నా.. మరొకరిని నొప్పించినట్లు అవుతుందని.. అందుకే విజయమ్మ అమెరికా వెళ్లిపోయారని మరికొందరు పోస్టులు పెట్టారు. ఏమైనా షర్మిల నామినేషన్‌ వేళ.. విజయమ్మ పంపించిన ఫొటోలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.