లడ్డు ప్రసాదం: ఈ రోజు ఏం జరగబోతోంది…?

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - September 21, 2024 / 09:48 AM IST

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, ఆహార మంత్రిత్వ శాఖలు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదికలు అడిగాయి. దీనితో టీటీడీ లడ్డూ – కల్తీ నెయ్యి విషయంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఈఓ ను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ రోజు ప్రభుత్వానికి టీటీడీ ఈఓ నివేదిక ఇచ్చే అవకాశం కనపడుతోంది. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలకు సర్కార్ దిగే అవకాశం కనపడుతోంది. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు కఠినంగానే ఉండే అవకాశం ఉంది. ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నివేదిక అందిన తర్వాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.