ఎమ్మెల్యే గురించి మొత్తం తెలుసు, మీడియాకు చంద్రబాబు షాక్

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - September 28, 2024 / 02:59 PM IST

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొలికిపూడి పై పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేసేందుకు తిరువూరు స్థానిక మీడియా ప్రతినిధులు రావడం పెద్ద దుమారం రేపుతోంది. కొలికిపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను సీఎంకు మీడియా ప్రతినిధులు అందించారు.

ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు కోరారు. చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. తనకు అన్ని విషయాలు తెలుసునని సమస్యను త్వరితగతిన పరీష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నాం అని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.