ఇంట్లో ప్రియురాలు.. ఇంటి బయట ఇల్లాలు.. దువ్వాడ స్టోరీ

సద్దుమణిగినట్లు కనిపించిన వైసీపీ నేత దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రమ్‌లో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మాధురి ఉండటంపై ఆయన భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్వెల మాధురి అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు.

  • Written By:
  • Publish Date - September 7, 2024 / 06:56 PM IST

సద్దుమణిగినట్లు కనిపించిన వైసీపీ నేత దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రమ్‌లో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మాధురి ఉండటంపై ఆయన భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్వెల మాధురి అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు. దీంతో దువ్వాడ వాణి, ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంటికి దగ్గరకు వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాణి, ఆమె కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు.

ఆ ఇల్లు తమదని… మాధురి ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. మాధురిని వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో అదే ఇంటి ముందు దువ్వాడ వాణి ఆందోళనకు దిగారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో అక్రమంగా ఉంటున్నారంటూ నిరసనకు దిగారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం సంచలనం రేపింది. భార్య వాణితో విభేదాలతో.. దివ్వెల మాధురి దగ్గరే శ్రీనివాస్‌ ఉంటున్నారు. దీంతో దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో మహిళతో ఉంటున్నారని టెక్కలిలోని నివాసం దగ్గర నిరసనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం వారం పాటు రచ్చ రచ్చ చేసింది. చివరకు దువ్వాడ శ్రీనివాస్, వాణి మధ్య వివాదాన్ని తొలగించేందుకు ఇద్దరి కుటుంబాలు ప్రయత్నం చేశాయి. అయితే వాణి వెనక్కి తగ్గినా… శ్రీనివాస్ మాత్రం తన అభిప్రాయాన్ని క్లారిటీగా చెప్పలేదు. వాణితో విడాకుల వివాదం కోర్టులో ఉందని చెప్పారు. ఇలా జరుగుతుండగానే టెక్కలిలోని శ్రీనివాస్ ఇంట్లో మాధురి కనిపించడంతో దువ్వాడ వాణి మళ్లీ నిరసనకు దిగారు. వివాదం అంతా ఆ ఇంటి చుట్టే తిరుగుతుండగా.. ఇప్పుడు ఆ ఇంట్లోకి మాధురి వచ్చింది.

డాబా మీద అటు ఇటు తిరగడం చూసి.. దువ్వాడ భార్యకు కోపం వచ్చింది. దీంతో ఇంటి లోపలికి కూతురితో కలిసి దూసుకెళ్లేందుకు.. శ్రీవాణి ప్రయత్నాలు చేసింది. ఐతే ఈ ఇంటిని మాధురికి శ్రీనివాస్ అమ్మేశారు. దీంతో ఆమె అక్కడికే వచ్చింది. ఐతే ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శ్రీవాణి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఉందని.. శ్రీవాణి అంటున్నారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా పోలీసులకు చూపించారు. ఏమైనా ఈ రచ్చ ఇంకా రగిలేలా కనిపిస్తోంది. ఈ ఫ్యామిలీ కథా చిత్రమ్‌లో ఇంకెన్ని మలుపు చూడాల్సి వస్తుందో మరి.