Janasena: తమ్మారెడ్డికి నాగబాబు సారీ చెప్పడం వెనక ఇంత జరిగిందా ?

ట్రిపుల్ ఆర్ విషయంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి, మెగా బ్రదర్ నాగబాబు మధ్య కనిపించిన పంచాయితీ అంతా ఇంతా కాదు.

  • Written By:
  • Publish Date - March 12, 2023 / 06:10 PM IST

ఎప్పుడో తీసిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ల కోసం.. ఇప్పుడు 80కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని.. ఆ డబ్బులు ఉండి ఉంటే పది సినిమాలు తీసి ముఖాన్నే కొట్టే వాడినని తమ్మారెడ్డి అంటే.. నాగబాబు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. 80కోట్ల డబ్బు మీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐతే తన వ్యాఖ్యలు వక్రీకరించారని.. దీనిపై అసభ్యంగా స్పందించారని.. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పారని మీ తండ్రి మీకు ఏమి నేర్పారంటూ నాగబాబుకు దీటుగా స్పందించారు తమ్మారెడ్డి.

సీన్ కట్ చేస్తే ఆలాఫ్ సడెన్‌గా తమ్మారెడ్డికి నాగబాబు క్షమాపణలు చెప్పారు. దీని వెనక భారీ కథే ఉందని.. జనసేన ప్రమేయం ఉందనే చర్చ జరుగుతోంది. నాగబాబు, తమ్మారెడడి మధ్య పంచాయితీ తీవ్రం అయితే.. అది అది కులాల మధ్య గొడవగా మారే అవకాశం ఉందని.. ఇది రాజకీయ పార్టీ అయిన జనసేనకు కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉందని గ్రహించిన ఆ పార్టీ వర్గాలు.. నాగబాబుని శాంతపరచినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయ్. మొదటిసారి నాగబాబు గారు మాట్లాడిన తీవ్రతకు.. రెండవసారి మాట్లాడిన తీవ్రతకు మధ్యన చాలాతేడా కనిపించింది. ఇది జనసేన ప్రభావమే అనే చర్చ జరుగుతోంది.