నేనేం చేయలేదు, చేయను: కొలికపూడి ఆన్సర్

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం విచారణ మొదలుపెట్టింది. ఫైవ్ మెన్ కమిటీ ముందుకు కొలికపూడి శ్రీనివాస్ వచ్చి వివరణ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - October 5, 2024 / 07:21 PM IST

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం విచారణ మొదలుపెట్టింది. ఫైవ్ మెన్ కమిటీ ముందుకు కొలికపూడి శ్రీనివాస్ వచ్చి వివరణ ఇచ్చారు. కొలికపూడి తో పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీ చిన్ని, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, అబ్జర్వర్ మురళీ లు భేటీ అయ్యారు.

నేనేం తప్పు చేయలేదు, ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్న కోలికపూడి… నావల్ల పార్టీకి ఇబ్బందులు వస్తె సరిదిద్దుకుంటానని హామీ ఇచ్చారట. రేపు మధ్యాహ్నం తిరువూరు లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి కొలికపూడి సమ్మతించారట. ఆ సమావేశానికి ఎంపీ చిన్ని, వర్ల రామయ్య లు హాజరుకావాలని పార్టీ ఆదేశించింది.