కేటిఆర్ నీ చెల్లిపై పెడితే ఊరుకుంటావా, కొండా సురేఖ కన్నీళ్లు

సోషల్ మీడియా పోస్ట్ లపై మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ చెల్లె జైల్ కు పోతే కేటీఆర్ కు బాధ లేదా అని నిలదీశారు.

  • Written By:
  • Updated On - September 30, 2024 / 09:04 PM IST

సోషల్ మీడియా పోస్ట్ లపై మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ చెల్లె జైల్ కు పోతే కేటీఆర్ కు బాధ లేదా అని నిలదీశారు. మహిళ మంత్రిగా నన్ను అవమానిస్తే నీకు పట్టదా అంటూ ప్రశ్నించారు. మీ ఇంట్లో మహిళలు లేరా, మీ మహిళలను అవమిస్తే ఇంతేనా అని ప్రశ్నించిన ఆమె… నన్ను బీఆర్ఎస్ నాయకులు అవమానించారు అని కన్నీరు పెట్టుకున్నారు.

నిన్నటి నుండి నేను అన్నం తినలేదు అన్నారు. కళ్యాణ్ లక్ష్మీ, షాది ముబారక్ చెక్స్ పంపిణీకి ఇంచార్జ్ మంత్రిగా వెళ్తే… గౌరవ ప్రదంగా ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేశారన్నారు. ఇలాంటి పోస్ట్ లు మీ చెల్లికి పెడితే సహిస్తావా అని నిలదీశారు. పశువుల కంటే అద్వాన్నంగా పోస్ట్ లు పెడితే సహించేది లేదు అని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు నన్ను అక్కా అని పిలుస్తారు అని అలాంటి నన్ను అవమానిస్తారా ఖబడ్దార్ కేటీఆర్ అంటూ హెచ్చరించారు. సైబర్ క్రైం కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.