ఎన్నికల్లో పోటీ చేస్తా మరో ట్విస్ట్‌ ఇచ్చిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వల మాధురి.. ఈ ఇద్దరు ఇప్పుడు న్యూస్‌లో, సోషల్‌ మీడియాలోనే కాదు.. మొత్తం ఏపీ మొత్తం ఫేమస్‌ అయ్యారు. మాధురి వల్లే భర్త తనకు దూరమయ్యాడని దువ్వాడ భార్య ఎప్పుడైతే రోడ్డెక్కిందో.. వీళ్ల వ్యవహారం రాష్ట్రమంతా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 06:42 PM IST

దువ్వాడ శ్రీనివాస్‌,దివ్వల మాధురి.. ఈ ఇద్దరు ఇప్పుడు న్యూస్‌లో, సోషల్‌ మీడియాలోనే కాదు.. మొత్తం ఏపీ మొత్తం ఫేమస్‌ అయ్యారు. మాధురి వల్లే భర్త తనకు దూరమయ్యాడని దువ్వాడ భార్య ఎప్పుడైతే రోడ్డెక్కిందో.. వీళ్ల వ్యవహారం రాష్ట్రమంతా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఆ తరువాత వీళ్ల కథలో కనిపించిన ట్విస్ట్‌లు, మలుపులు అన్నీ ఇన్నీ కావు. సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ల స్టోరీతో ఓ మంచి సస్పెన్స్‌ ఉన్న లవ్‌స్టోరీ తీయొచ్చ.

అంతలా అటెన్షన్‌ గ్రాబ్‌ చేసిన వీళ్లు అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో మాధురి ఓ ఇంటర్య్యూలో సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చెప్పారు. ఎక్కడి నుంచి.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న విషయం చెప్పకపోయినా.. మాధురి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. చాలా కాలం నుంచి మాధురి వైసీపీలోనే పని చేస్తోంది. ఆ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌తో కలిసి యాక్టివ్‌గా ఉండేది. దువ్వాడ శ్రీను గడపగడపకు కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా మాధురి ఆయనతోనే ఉంది.

ఎన్నికల్లో శ్రీను కోసం స్వయంగా రెండు కోట్లు ఖర్చు పెట్టింది. సింపుల్‌గా చెప్పాలంటే పోటీ చేసింది దువ్వాడ శ్రీనే అయినప్పటికీ.. బాధ్యత మొత్తం తానే తీసుకుంది. నిన్నటి వరకూ దువ్వాడ జీవితంలో మాత్రమే ఎంటర్‌ఐన మాధురి ఇప్పుడు ఆయన పొలిటికల్‌ జర్నీలో కూడా ఎంటర్‌ కాబోతోంది. ఐతే ఇప్పుడు జరిగిన రచ్చ కారణంగా వైసీపీ ఆమెకు టికెట్‌ ఇస్తుందా ఇవ్వదా అన్న విషయం పక్కన పెడితే.. టెక్కలి నుంచే ఆమె పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు నుంచీ అదే ప్రాంతానికి చెందిన మాధురి గత ఎన్నికల సమయంలో శ్రీనుతో కలిసి నియోజకవర్గం మొత్తం తిరిగింది. ఆ అనుభవంతో ఇప్పుడు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యింది.