శ్రీను బావను పెళ్లి చేసుకుంటా: దివ్వెల మాధురి

తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేయసి దివ్వెల మాధురి సందడి చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 06:51 PM IST

తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేయసి దివ్వెల మాధురి సందడి చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. నేను, మాధురి తిరుమలలో వివాహం చేసుకున్నామని కోంత మంది దుష్రచారం చేస్తున్నారు, వాణితో నాకు న్యాయపరమైన అంశాలు కోర్టులో వున్నాయి, కోర్టు తీర్పు తరువాత తదుపరి కార్యక్రమాలు వుంటాయి అని స్పష్టం చేసారు. మాధురికి కూడా వివాహిత, తన భర్తతో కేసు నడుస్తోందని తెలిపారు.

మేము గతంలో కూడా తిరుమలకు విచ్చేసాం….ఇవాళ కూడా దర్శనం కోసమే వచ్చాం అన్నారు. ఇక పెళ్లిపై మాధురి కీలక ప్రకటన చేసారు. ఇద్దరికి విడాకులు వచ్చిన తరువాత మేము వివాహం చేసుకుంటాం అని మాధురి ప్రకటించారు. అప్పటి వరకు ఇద్దరం కలిసే జీవిస్తామన్నారు. ఇక తిరుమల శ్రీవారి మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు హల్చల్ చేయడం వివాదాస్పదం అవుతోంది. ప్రైవేట్ కెమెరామెన్ తో విజువల్స్ తీసుకున్నారు మాధురి.

రిల్స్ కు ఉపయోగపడే విధంగా వీడియోస్ తీసుకున్నట్లు సమాచారం. అయితే మాడ వీదుల్లో రిల్స్ ను నిషేధించారు. మాడవీధుల్లో రీల్స్ చేయడం నిషిద్ధమైనప్పటికీ హడావిడిగా రీల్స్ చేసారు మాధురి.