రోజా ఈ జుగుప్స అప్పుడేమైంది…? ఆడుకుంటున్న జనసేన

మూడు పెళ్ళిళ్ళు, మూడేళ్ళకు కారు మార్చినట్టు పెళ్ళాం మార్చడం, ఎంతో మంది పిల్లలు... సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసిన ఆరోపణలు.

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 06:20 PM IST

మూడు పెళ్ళిళ్ళు, మూడేళ్ళకు కారు మార్చినట్టు పెళ్ళాం మార్చడం, ఎంతో మంది పిల్లలు… సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసిన ఆరోపణలు. ఈ వ్యాఖ్యల విషయంలో ఆయన గాని ఆయన పార్టీ గాని పునరాలోచించుకుందో లేదో తెలియదు గాని… పవన్ కళ్యాణ్ విషయంలో ఆ పార్టీ నాయకులు అందరూ ఇంతే దారుణంగా పదే పదే మాట్లాడారు. పవన్ 21 స్థానాలకు 21 గెలవడానికి ఒకరకంగా వాళ్ళే రహదారి వేసారు అని స్పష్టంగా చెప్పాలి.

ఇక పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న ఆర్కే రోజా అయితే అత్యంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెళ్ళాలు, వెంట్రుకలు పీకడం గురించి పదే పదే మాట్లాడారు రోజా. అలాంటి రోజా ఇప్పుడు కొండా సురేఖ, సమంతాపై చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఒక మహిళగా మరో మహిళపై చేసిన వ్యాఖ్యలను ఖండించడంలో తప్పు లేదు గాని… గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఇంతకంటే దారుణంగా మాట్లాడినప్పుడు రోజా మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇప్పుడు కొండా సురేఖ ఏ మంత్రి హోదాలో అయితే విమర్శలు చేసారో… రోజా కూడా మంత్రిగా ఉండే విమర్శలు అత్యంత దారుణంగా చేసిన రోజులు ఉన్నాయి. ఇక సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై విమర్శలు చేసినప్పుడు కూడా రోజా మంత్రిగానే ఉన్నారు. మరి అప్పుడు కనీసం స్పందించకుండా ఎంజాయ్ చేసిన రోజా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో జనసేన ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. అప్పుడు జుగుప్సగా అనిపించలేదా రోజా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యలది వ్యక్తిగత జీవితం కాదా…? పవన్ కళ్యాణ్ ది వ్యక్తిగత జీవితం కాదా రోజా…? అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మానవత్వం అన్ని సందర్భాల్లో ఉండాలని హితవు పలుకుతున్నారు.