Priyanka Gandhi : నేడు ప్రియాంక గాంధీ పర్యటన.. ఒక్కకరు మూడు నియోజకవర్గాల్లో పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవంతంగా ఉన్నాయి. ఒకరికి మించి మరొకరు ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం సమయం ముగియనుండటంతో.. ప్రధాన పార్టీలు ఒక్క రోజులో 3 నుంచి 6 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా ప్లాన్ వేసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవంతంగా ఉన్నాయి. ఒకరికి మించి మరొకరు ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం సమయం ముగియనుండటంతో.. ప్రధాన పార్టీలు ఒక్క రోజులో 3 నుంచి 6 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా ప్లాన్ వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నేడు ప్రియాంక గాంధీ తెలంగాణలో మూడు నియోజకవర్గాల్లో, ఇక, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు భువనగిరి, గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్టీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

KCR TOUGH FIGHT: టఫ్ ఫైట్.. కేసీఆర్‌కి టఫ్ ఫైట్ ఎక్కడ..? రెండు చోట్లా బీఆర్ఎస్ శ్రేణులు అలెర్ట్..

అక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయబోతున్నారు. ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రియాంక గాంధీ కొడంగల్ లోని బహరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు చివరి రోజు హైదరాబాద్ నడిబొడ్డులో కాంగ్రెస్ అగ్ర నేతలు భారీ జన సందోహం మధ్య రోడ్ షో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గం కొడంగల్ ల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనుంది.

రేపు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో.. హైదరాబాద్ నగరంలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ నుంచి వచ్చిన దాదాపు ఉన్నత స్థాయి నాయకులు అందరు ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెల్లడించారు.