బ్రేకింగ్: అరెస్ట్ భయంలో సజ్జల…?

వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకి వెళ్ళడంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో కూడా ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 09:09 AM IST

వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా జైలుకి వెళ్ళడంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో కూడా ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సజ్జల అలెర్ట్ అయ్యారు. టిడిపి కార్యాలయం దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి.

ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో నన్ను చేర్చారు అంటూ పిటిషన్ వేసారు. కోర్టు షరతులకు లోబడి ఉంటానంటూ బెయిల్ కోరారు సజ్జల. దీనిపై నేడు కోర్ట్ విచారణ చేయనుంది. మరోవైపు ఇదే కేసులో నందిగం సురేష్ కూడా హైకోర్ట్ లో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.