షాకింగ్: కొడాలి నానీపై రజనీ కాంత్ కుమార్తె కేసు ఫైల్…?

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానీపై సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె కేసు ఫైల్ చేస్తున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది.

  • Written By:
  • Updated On - August 14, 2024 / 10:55 AM IST

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానీపై సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె కేసు ఫైల్ చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. దీని వెనుక బలమైన కారణం ఉందని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఏడాది మేలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమానికి రజనీ కాంత్ ను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రజనీ కాంత్… ఎన్టీఆర్, చంద్రబాబుతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబును రజనీ కాంత్ ఎక్కువగా కొనియాడారు. ఇది నచ్చని వైసీపీ నేతలు… ఎవరూ ఊహించని విధంగా రజనీ కాంత్ పై మాటల దాడికి దిగారు. మాటల యుద్దంలో పది అడుగులు ముందు ఉండే కొడాలి నానీ అయితే రజనీ కాంత్ ఆరోగ్యంపై కూడా విమర్శలు చేసారు అప్పుడు. ఒక రోజు షూటింగ్ చేస్తే పది రోజులు పడుకుంటారు అని, నీచాతి నీచమైన వ్యక్తి రజనీ కాంత్ అంటూ ఘాటు విమర్శలు చేసారు. దీనిపై రజనీ కాంత్ ఫ్యాన్స్ తో పాటుగా టీడీపీ అభిమానులు కూడా కొడాలి నానీని తప్పుబట్టారు.

అసలు రజనీ కాంత్ ను తిట్టాల్సిన పనేంటి అంటూ వైసీపీ నేతలు కూడా ప్రశ్నించారు ఒకానొక సందర్భంలో. దీనిపై రజనీ కాంత్ స్పందించకపోయినా… తన సినిమా జైలర్ ఆడియో ఫంక్షన్ లో తన మార్క్ డైలాగ్ చెప్పారు. ఇది వైసీపీ నేతల కోసమే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే దీనిపై అప్పుడు సైలెంట్ గా ఉన్న రజనీ కాంత్ కుటుంబం… ఇప్పుడు కేసు పెట్టేందుకు సిద్దమైంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో కేసు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని భావించి స్పందించలేదు. కాని ఇప్పుడు రజనీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య… మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. స్వయంగా ఆమెనే వచ్చి కేసు పెడతారని తెలుస్తోంది.