Venuswami : వైసీపీకి వేణుస్వామి టెన్షన్‌…

వేణుస్వామి.. ప్రత్యేకంగా అవసరం లేని పేరు. భవిష్యత్‌ను తానే డిసైడ్ చేస్తున్న అన్నట్లు ఉంటాయ్ మనోడి బిల్డప్‌లు. స్పోర్ట్స్, సినిమా, రాజకీయాలు.. ఏదీ వదలకుండా జాతకాలు చెప్పేస్తుంటారు.

 

వేణుస్వామి.. ప్రత్యేకంగా అవసరం లేని పేరు. భవిష్యత్‌ను తానే డిసైడ్ చేస్తున్న అన్నట్లు ఉంటాయ్ మనోడి బిల్డప్‌లు. స్పోర్ట్స్, సినిమా, రాజకీయాలు.. ఏదీ వదలకుండా జాతకాలు చెప్పేస్తుంటారు. పొరపాటుగా ఒక్కటి నిజమైనా.. ముందే చెప్పాగా అంటూ మొదలుపెడతాడు. వందలో గట్టిగా ఒకటి నిజం అవుతుందేమో.. వేణుస్వామి చెప్పింది. నాగచైతన్య, సమంత విడిపోతారని.. తాను ముందే చెప్పానంటూ.. వేణుస్వామి ఇప్పటికీ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ప్రమోషన్ మాములుగా ఉండదు. ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ పట్టుకొని మరీ.. జాతకాల బుక్ ముందు పెడతాడు. సినిమా రంగాల్లో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెప్తూ.. తనను తాను ప్రమోట్ చేసుకుంటూ.. సెలబ్రిటీ జ్యోతిష్యుడిలా మారిపోయారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌ గెలుస్తుందన్నారు.. ప్రభాస్ కెరీర్ అయిపోయిందన్నారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌దే కప్ అని దొరికిపోయారు.. ఇలా వేణుస్వామి వరుస వివాదాలకు కారణం అవుతూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు వేణుస్వామి ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. ఐపీఎల్ ఫైనల్‌పై వేణుస్వామి జోష్యంపై ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అదన్నావ్.. ఇదన్నావ్‌.. ఇలా అయిందేంటి అంటూ ఆట ఆడేసుకుంటున్నారు. కావ్య మారన్ జాతకం ప్రకారం.. హైదరాబాద్ గెలుస్తుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. ఐతే ఎస్‌ఆర్‌హెచ్.. దారుణంగా ఓడిపోయింది. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు వేణుస్వామి వైసీపీని టెన్షన్‌ పెడుతున్నాడు.

ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ పార్టీదే విజయం అని.. జగన్ మళ్లీ సీఎం అవుతారని.. సరిగ్గా మూడు నెలల ముందు జోష్యం చెప్పాడీ జోతిష్యుడు. జగన్ జాతకం బాగుందని.. 2024లో గెలవడంతోపాటు 2029 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారని.. నోటికి వచ్చిన డప్పల్లా కొట్టుకు వచ్చారు. సన్‌రైజర్స్ విషయంలో వేణుస్వామి జోష్యం రివర్స్ అయింది.. మరి తమ పార్టీ విషయంలో ఏం జరుగుతుందోనని.. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తెగ కంగారు పడిపోతున్నారు.