హైడ్రాకు వైసీపీ నేత వార్నింగ్

తన భవనాలను హైడ్రా కూల్చింది అనే వార్తల నేపధ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి స్పందించారు. హైడ్రా కూల్చివేతలకు నాకు సంబంధం లేదు అన్నారు ఆయన. బిల్డింగ్ నాది కాదు అని స్పష్టం చేసారు.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 06:30 PM IST

తన భవనాలను హైడ్రా కూల్చింది అనే వార్తల నేపధ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి స్పందించారు. హైడ్రా కూల్చివేతలకు నాకు సంబంధం లేదు అన్నారు ఆయన. బిల్డింగ్ నాది కాదు అని స్పష్టం చేసారు. వాచ్మెన్ రూమ్, షెడ్ మాత్రమే మాకు సంబందించినది అని నా భార్య,రమేష్ అనే వారి పేరుపై ఉందన్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా కూల్చడం భావ్యం కాదు అన్నారు ఆయన.

తాము నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు. నాపై పనికట్టుకుని కొందరు టిడిపి నేతలు అసత్యాప్రచారం చేస్తున్నారు అని ఎక్కడ , ఎవరు కబ్జా చేసినా నాపై బురద చల్లడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు నోటీసులు ఇస్తా అన్నారు రాంభూపాల్ రెడ్డి.