బ్రేకింగ్: లడ్డు వివాదంపై జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ టార్గెట్ చేసి ప్రభుత్వం విమర్శలు చేస్తున్న నేపధ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - September 25, 2024 / 04:11 PM IST

ఆంధ్రప్రదేశ్ లో లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ టార్గెట్ చేసి ప్రభుత్వం విమర్శలు చేస్తున్న నేపధ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. “తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి…

జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది అని జగన్ పేర్కొన్నారు.