చుట్టూ వరద.. కారెక్కి ముచ్చట్లు.. వీళ్లు మాములోళ్లు కాదు బాస్‌..

దేశవ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయ్. నాన్‌స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయ్‌. గుజరాత్‌లో వానలు దంచికొడుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 06:46 PM IST

దేశవ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయ్. నాన్‌స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయ్‌. గుజరాత్‌లో వానలు దంచికొడుతున్నాయ్. సబర్‌కాంత జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయ్. ఐతే ఈ వరదలో ఓ జంట చిక్కుకుంది. రెండు గంటలు ఆ ఇద్దరు కారు రూఫ్ ఎక్కి గడిపిన వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వరద తక్కువగా ఉందనుకున్న దంపతులు.. కారుతో కాజ్‌వేను దాటే ప్రయత్నం చేశారు. ఐతే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు నదిలో కొట్టుకుపోయింది. ఓ చోట రాళ్ల మధ్యలో చిక్కుకుపోవడంతో.. దింపతులిద్దరూ కారు టాప్‌ పైకి ఎక్కారు. దాదాపు రెండు గంటల పాటు కారు టాప్‌ పైనే ఉండిపోయారు. చివరకు పోలీసులు వచ్చి.. రెస్క్యూ చేశారు. ఈ ఘటనను అక్కడి జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. కారు కాజ్‌వే నుంచి ఒకటిన్నర కిలోమీటర్‌ కొట్టుకుపోయింది. అయినా ఆ దంపతులు టెన్షన్ పడలేదు. ధైర్యంగా కారు టాప్‌ ఎక్కి కూర్చున్నారు. ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఏదో ఈవినింగ్‌ వాకింగ్‌లో పరిచయం అయినట్లు.. ఇంటి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నట్లు.. ఆ వరదలో.. ఆ కారు రూఫ్‌ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఫోన్ చూస్తుండడం.. ఆమె ఏదో చెప్తున్నట్లు కనిపించడం.. చుట్టూ చావు ఎదురుచూస్తుందని తెలుస్తున్నా.. ఇంత భయం లేదేంటి వీళ్లకు అనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఇవి మాములు గుండెలు కాదు.. ఈ గుండెలు బతకాలి.. ఈ ధైర్యం పది మందికి ధైర్య అవుతుంది అంటూ.. ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్న వాళ్లు కొందరు అయితే.. భయంతో కంగారు పడిపోకుండా.. ధైర్యంగా కారు మీద ఉన్న వాళ్ల మీద ప్రశంసలు గుప్పిస్తున్న వారు మరికొందరు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.