Visakhapatnam: ఫోన్‌ మాట్లాడలేదని పెళ్లి కూతురుపై అలిగి.. పెళ్లి కొడుకు జంప్‌..

పెళ్లికూతురు తనతో వారం రోజులు ఫోన్‌లో మాట్లాడలేదని అలకపాన్పు ఎక్కిన పెళ్లికొడుకు.. పీటల మీద నుంచి జంప్ కొట్టాడు. బాత్రూమ్‌లో దూరి గడియ పెట్టుకొని.. రానంటే రాను అని మారాం చేశాడు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 08:19 PM IST

Visakhapatnam: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. అంటే కచ్చితంగా జరిగి తీరుతుంది. అది నిజమో కాదో కానీ.. ఇది వింటే మాత్రం హవ్వా అని అవాక్కవుతారు మీరంతా ! పెళ్లిళ్లను దేవుళ్లే కాదు.. ఫోన్‌లు కూడా డిసైడ్ చేస్తాయా అని ఒక అనుమానం వస్తుంది మీకు కచ్చితంగా ! ఒక బంధం ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే మీరిచ్చే ఆన్సర్ ఏంటి.. కుటుంబ కారణమో, కులం కారణమో, లేదంటే అభిరుచులు కలవకపోవడమో అనే కదా చెప్తారు.

ఇక్కడ మాత్రం పీటల వరకు వచ్చిన పెళ్లి.. ఫోన్‌ వల్ల ఆగిపోయింది. ఏంటి అవాక్కవుతున్నారా..? నిజంగా ఇదే నిజం ! విశాఖ జిల్లా పాత గోపాలపట్నంలో జరిగింది ఈ ఘటన. పెళ్లికూతురు తనతో వారం రోజులు ఫోన్‌లో మాట్లాడలేదని అలకపాన్పు ఎక్కిన పెళ్లికొడుకు.. పీటల మీద నుంచి జంప్ కొట్టాడు.

బాత్రూమ్‌లో దూరి గడియ పెట్టుకొని.. రానంటే రాను అని మారాం చేశాడు. పాతగోపాలపట్నంకు చెందిన సంతోష్‌కు, విశాఖకు చెందిన పద్మావతికి.. ఈ నెల 25న ఉదయం 11గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టారు. రింగులు మార్చుకొని, కట్నకానుకలు తీసుకొని.. తీరా పెల్లికి మూడు ముళ్లకు మూడు నిమిషాల ముందు.. తనకీ పెళ్లి ఇష్టం లేదంటూ పీటల మీద నుంచి పారిపోయాడు పెళ్లికొడుకు. అదే మండపంలోని బాత్రూమ్‌లో దాక్కున్నాడు. ఎందుకు వద్దు అనుకుంటున్నావ్‌ సంతోష్ అంటే.. మనోడు చెప్పిన ఆన్సర్‌కు.. రెండు కుటుంబాల పెద్దలకు దిమ్మ తిరిగి మైండ్‌బ్లాంక్ అయింది. వారంరోజులుగా పెళ్లికూతురు తనతో మాట్లాడడం లేదని.. పెళ్లి కొడుకు సంతోష్ అలకపాన్పు ఎక్కాడు. పెళ్లి చేసుకోను పో అంటూ బుంగమూతి పెట్టుకొని మరీ జంప్ అయ్యాడు.

ఈ న్యూస్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదెక్కడి అలకరా బాబు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక అటు సంతోష్‌, పద్మావతిని పీఎస్‌కు పిలిపించిన పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కట్నం వల్ల ఆగిపోయే పెళ్లిళ్లు చూశాం.. కక్షల వల్ల ఆగిపోయే పెళ్లిళ్లు చూశాం.. ఇలా ఫోన్‌లో మాట్లాడడం లేదని పెళ్లి ఆగిపోవడం ఏంట్రా బాబు.. పెళ్లంటే ఇదేనా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.