సెమీస్ లో అమన్ సహ్రావత్

  • Written By:
  • Publish Date - August 8, 2024 / 07:33 PM IST

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్న వేళ రెజ్లర్ అమన్ సహ్రావత్ సత్తా చాటాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరుకున్నాడు. మొదట ప్రిక్వార్టర్స్‌లో అమన్ 10-0 తేడాతో వాద్లిమిర్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరాడు. తర్వాతి బౌట్ లో అల్బేరియా రెజ్లర్ ను చిత్తు చేశాడు. 12-0 స్కోర్ తో మాజీ వరల్డ్ ఛాంపియన్ కు షాకిచ్చాడు. తొలి రౌండ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై అమన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి తిరుగులేని ఆధిక్యంతో గెలిచాడు. సెమీస్ లో అమన్ జపాన్ కు చెందిన ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ హిగుచితో తలపడతాడు.