Gujarat Titans : గుజరాత్ కు బిగ్ షాక్… రూ. 3.6 కోట్ల ప్లేయర్ దూరం

ఐపీఎల్‌-2024 (IPL 2024) సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌కు (Gujarat Titans) బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌ కీపర్‌ రాబిన్ మింజ్ ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) శధ్రువీకరించాడు.

ఐపీఎల్‌-2024 (IPL 2024) సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌కు (Gujarat Titans) బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌ కీపర్‌ రాబిన్ మింజ్ ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) శధ్రువీకరించాడు. జార్ఖండ్‌ (Jharkhand) కు చెందిన రాబిన్ మింజ్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మింజ్‌ ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.

అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి 4 నుంచి 6 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్‌ 17వ సీజన్‌ మొత్తానికి మింజ్‌ దూరమయ్యాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రాబిన్ మింజ్‌ను 3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్‌లో వేలంలో అమ్ముడు పోయిన మొట్ట మొదటి ఆదివాసీ క్రికెటర్‌గా నిలిచాడు.