టెస్ట్ మ్యాచ్ టికెట్ రూ.15 ఎక్కడో తెలుసా ?

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 04:16 PM IST

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య వచ్చే వారం నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ చూడ్డానికి ప్రేక్షకులు వస్తారో, రారో అన్న భయం పాక్ కు పట్టుకుంది. దీంతో చేసేది ఏమీ లేక టికెట్ రేట్లను దారుణంగా తగ్గించేసింది. రావల్పిండి వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు టిక్కెట్ కనీస ధర భారత కరెన్సీలో 60 రూపాయలుగా నిర్ణయించింది. ఇక రెండో టెస్ట్ కు ఈ ధరను పాక్ క్రికెట్ బోర్డ్ మరింతగా తగ్గించింది. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు టిక్కెట్ కనీస ధర పీకేఆర్ కేవలం 15 రూపాయలుగా నిర్ణయించింది. దశాబ్ద కాలంలో కరాచీ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టికెట్స్ విక్రయించడం ఇదే తొలిసారి. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ కు అభిమానులు ఎవ్వరూ రాకపోవడం ఖాళీ స్టాండ్సే కనిపించాయి. దీంతో రేట్లు భారీగా తగ్గించక తప్పలేదు.