దీప్తి శర్మ విన్నింగ్ సిక్సర్ ధోనీ స్టైల్ లో మ్యాచ్ ఫినిష్

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సర్ ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తనదైన స్టైల్ లో ధోనీ మ్యాచ్ ను ఫినిష్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 04:00 PM IST

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సర్ ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తనదైన స్టైల్ లో ధోనీ మ్యాచ్ ను ఫినిష్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు. నిజానికి క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ ను గెలిపించేందుకు కొట్టే సిక్సర్ లేదా బౌండరీ ఆయా జట్లకే కాదు అభిమానులకు ఫుల్ కిక్కు ఇస్తుంది. తాజాగా ధోనీ తరహాలోనే భారత మహిళ క్రికెటర్ దీప్తి శర్మ మ్యాచ్ ను ఫినిష్ చేసింది. సిక్సర్ తో తన జట్టుకు టైటిల్ అందించింది. మహిళల హండ్రెడ్ లీగ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న దీప్తి శర్మ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడింది.

ఈ మ్యాచ్‌లో వెల్ష్‌ ఫైర్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని లండన్‌ స్పిరిట్‌ 98వ బంతికి ఛేదించి విజేతగా నిలిచింది. లండన్‌ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ సిక్సర్‌ బాది మ్యాచ్‌ను గెలిపించింది. ముఖ్యంగా చివరి 3 బంతులు మిగిలి ఉండగా లండన్‌ డగౌట్‌ అంతా టెన్షన్ లో కనిపించింది. దీప్తి సిక్సర్‌ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ గా మారాయి.
దీప్తి కొట్టిన విన్నింగ్ సిక్సర్ తో లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఆల్ రౌండర్ దీప్తిశర్మ ధోనీ స్టైల్ లో మ్యాచ్ ను ముగించిందంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.