టీమిండియా భవిష్యత్ చెప్పిన నంబర్ వన్ బౌలర్

ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్‌ను మార్చింది. టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ ఓపికతో ఆడేవారు. అయితే ఇంగ్లండ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో 'బేస్‌బాల్ గేమ్'ని తీసుకొచ్చింది. దాన్నే బజ్ బాల్ గేమ్ అని పిలవడం స్టార్ట్ చేసారు.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 08:15 PM IST

ఇటువంటి పరిస్థితిలో భారతదేశంలో బేస్ బాల్ విజయం సాధించగలదా అని చర్చించబడుతోంది. ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. భారతదేశంలో బేస్‌బాల్‌ను స్వీకరించడంలో పెద్ద అడ్డంకి అభిమానులు, మేనేజ్‌మెంట్‌లో ఓపిక లేకపోవడమేనంటూ చెప్పుకొచ్చాడు. దీని కారణంగా చాలా మంది ఆటగాళ్లు కెరీర్ ప్రమాదంలో ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, ‘త్వరలో భారత టెస్ట్ జట్టులో మార్పులు జరుగుతాయి. ఆ దశలో విషయాలు అంత సులభం కాదంటూ’ చెప్పుకొచ్చాడు. ఒక ఆటగాడు హ్యారీ బ్రూక్ లాగా ప్రతి బంతికి బ్యాట్ విసిరి ఔట్ అవుతున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. అప్పుడు మనం ఏంచేద్దాం? మనం బేస్ బాల్ ఆటగాళ్లకు మద్దతు ఇస్తామా? మా ప్లేయింగ్ ఎలెవన్‌లో కనీసం నలుగురు ఆటగాళ్లు రిటైర్మెంట్‌కు దారి చూపినట్లే’ అని అశ్విన్ తెలిపాడు. టెస్ట్ మ్యాచ్‌లు చూసే ప్రజలు కూడా ఈ శైలిని సమర్థిస్తున్నారు. కానీ మనం అలా చేయలేం’ అంటూ చెప్పుకొచ్చాడు.