IPL 2024 : లైఫ్ టైమ్ సెటిల్మెంట్..

ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు.

 

ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని 8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. జార్ఖండ్ యంగ్ ప్లేయర్ కుమార్ కుషగ్రా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్ కావడంతో.. భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. కుషగ్రను 7 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక మిగతా ఆటగాళ్లకు సంబంధించి, గుజరాత్ టైటాన్స్ 7 కోట్ల 40 లక్షలు వెచ్చించి, షారుఖ్ ఖాన్ ను సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, 5 కోట్ల 80 లక్షలతో శివమ్ దూబేను దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, 5 కోట్ల బిడ్ తో, యష్ దయాళ్ ను తీసుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, 2 కోట్ల 40 లక్షలతో మనిమారన్ సిద్ధార్థ్ ను తమ జట్టులోకి ఆహ్వానించింది. దేశవాళీ టౌర్నీల్లో అదరగొట్టిన యువకులకు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కళ్ళు చెదిరే ఆఫర్స్ తో వెల్ కమ్ చెప్పాయి.