గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ విధ్వంసం సిక్సర్లతో రెచ్చిపోతున్న అభినవ్ మనోహర్

ఐపీఎల్ మెగా వేలానికి ముందు పలువురు యువ ఆటగాళ్ళు చెలరేగిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 05:28 PM IST

ఐపీఎల్ మెగా వేలానికి ముందు పలువురు యువ ఆటగాళ్ళు చెలరేగిపోతున్నారు. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నారు. తాజాగా మహారాజా టీ20 టోర్నీలో గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌ అభినవ్‌ మనోహర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్‌ 10 మ్యాచ్‌ల్లో 6 అర్ద సెంచరీల సాయంతో 84.50 సగటున 507 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్‌ ఏకంగా 52 సిక్సర్లు బాదాడు. తాజాగా బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభినవ్‌ 24 బంతుల్లో 7 సిక్సర్లు, 1 బౌండరీతో 59 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ స్ట్రోక్ ప్లే చూస్తే వచ్చే మెగా వేలంలో జాక్ పాట్ కొట్టే అవకాశముంది.