ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ హాకీ జట్టు

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతోంది.

  • Written By:
  • Publish Date - September 12, 2024 / 07:16 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో విజయంతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సౌత్ కొరియాను 3-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండో గోల్స్ , అర్జీత్ సింగ్ ఒక గోల్ చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి మ్యాచ లో చైనాపై 3-0 , రెండో మ్యాచ్ లో జపాన్ పై 5-0 , మూడో మ్యాచ్ లో మలేషియాపై 8-1 గోల్స్ తేడాతో విజయాలు అందుకుంది. కాగా తన చివరి గ్రూప్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సేన శనివారం పాకిస్తాన్ తో తలపడుతుంది.