IPL 2024: స్టార్స్‌తో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. వేడుకల్లో పెర్ఫార్మ్ చేసేది ఎవరంటే ?

ఐపీఎల్ 17వ సీజన్‌కు మరికొన్ని గంటల్లోనే తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్‌లోనే టాప్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కంటే ముందు భారీ ఓపెనింగ్ సెర్మనీ కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది.

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 04:23 PM IST

IPL 2024: వరల్డ్ క్రికెట్‌లో క్రేజీయెస్ట్ లీగ్ ఐపీఎల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు.. బ్రాండింగ్ లోనూ, క్వాలిటీలోనూ, వ్యూయర్ షిప్‌లోనూ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా మరే లీగ్ లేదు. ఇలాంటి లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ 17వ సీజన్‌కు మరికొన్ని గంటల్లోనే తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్‌లోనే టాప్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి.

Mumbai Indians: కొత్త కెప్టెన్.. పాత జట్టు.. ముంబై ఆరేస్తుందా..?

ఈ మ్యాచ్ కంటే ముందు భారీ ఓపెనింగ్ సెర్మనీ కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఆరంభ వేడుకల్లో ఎప్పటిలానే పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ వేడుకల్లో ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అలరించనున్నాడు. రెహమాన్‌తో పాటు సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్.. పెర్ఫార్మ్ చేయనున్నారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు వీరంతా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.

ఆరంభ వేడుకలు అరగంట సేపు ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేసినట్టు సమాచారం. గత ఏడాది కూడా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెర్మనీలో పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. కాగా ఆరంభ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నైకి చేరుకున్న సీఎస్కే, బెంగళూరు జట్లు ప్రాక్టీస్‌‌లో బిజీగా ఉన్నాయి.