జడ్డూ భాయ్ 12వ సారి ఆల్ రౌండర్ అరుదైన రికార్డ్

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్ట్‌ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన జడేజా.. మ్యాచ్‌ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు.

  • Written By:
  • Publish Date - September 23, 2024 / 03:55 PM IST

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్ట్‌ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన జడేజా.. మ్యాచ్‌ మొత్తంలో ఐదు వికెట్లు తీశాడు. ఇలా ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ, ఐదు వికెట్లు తీయడం​ జడేజాకు ఇది 12వ సారి. భారత క్రికెటర్లలో ఈ ఘనతను ఇన్ని సార్లు ఎవ్వరూ సాధించలేదు. జడ్డూ తర్వాతి స్థానంలో అశ్విన్‌ నిలిచాడు. వీరిద్దరి తర్వాత కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌ ఉన్నారు. వీరి మినహా ఏ భారత క్రికెటర్‌ రెండు కంటే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించలేదు. ఇటీవలే అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన జడేజా ప్రస్తుతం టెస్టులు, వన్డే ఫార్మాట్ లలో కొనసాగుతున్నాడు.