Jasprit Bumrah: ఐర్లాండ్‌తో టీ20 పోరుకు సిద్ధమైన టీమిండియా.. బుమ్రా రీఎంట్రీ..

ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది.

  • Written By:
  • Updated On - August 14, 2023 / 06:49 PM IST

Jasprit Bumrah: ఐర్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న జరగనుండగా, రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. ఇక చివరి, 3వ మ్యాచ్ ఆగస్టు 22న జరగనుంది. డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లన్నింటికీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. టీ20 సిరీస్ ఓటమి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న భారత యువ జట్టు కరేబియన్ టూర్‌ను పూర్తి చేసింది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. రేపు ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీమిండియా ఐర్లాండ్ వెళ్లనుంది. స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో భారత్ ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వయాకామ్ 18 ప్రత్యక్ష ప్రసార హక్కులను కలిగి ఉంది.

స్పోర్ట్ 18లో మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. జియో సినిమాలో స్ట్రీమింగ్ ఉంటుంది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్సీ లభించింది. ప్రసీద్ధ్ కృష్ణ, శివమ్ దూబే తిరిగి జట్టులోకి రాగా, రింకూ సింగ్, జితేష్ శర్మలకు అవకాశం లభించింది. రాబోయే ఆసియా కప్, ICC ODI ప్రపంచ కప్ కోసం జట్టును రూపొందించడంలో ఇది సహాయపడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.