నీరజ్‌ చోప్రాతో లవ్‌.. మను బాకర్ క్లారిటీ..

మనుబాకర్‌.. 140కోట్ల భారతీయుల గుండెలు ఉప్పొంగేలా చేసిన అథ్లెట్‌. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు.. ఆమె పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి.. రికార్డ్‌ క్రియేట్‌ చేయడంతో.. ఆమె పేరు మారుమోగిపోయింది.

  • Written By:
  • Publish Date - August 15, 2024 / 02:18 PM IST

మనుబాకర్‌.. 140కోట్ల భారతీయుల గుండెలు ఉప్పొంగేలా చేసిన అథ్లెట్‌. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు.. ఆమె పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి.. రికార్డ్‌ క్రియేట్‌ చేయడంతో.. ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ 22ఏళ్ల అమ్మాయికి… ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇక అటు స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, పారిస్‌ ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత నీరజ్‌ చోప్రాతో.. మను బాకర్‌ కలిసి ఉన్న వీడియో ఈ మధ్య వైరల్‌ అయింది. దీంట్లో ఇద్దరూ సిగ్గుపడుతూ సంభాషణ సాగిస్తున్నట్లుగా కనిపించింది. దీనికి తోడు మను తల్లి… నీరజ్‌తో మాట్లాడడం.. తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడంతో సోషల్‌ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది.

మనుతో నీరజ్‌ ప్రేమలో ఉన్నాడని.. అతడితో ఆమె పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్లు ఉన్నాయనే ప్రచారం జరిగింది. తమ కూతురును పెళ్లి చేసుకోవాలని నీరజ్‌ను… మను అమ్మ కోరినట్లు.. అందుకే ఒట్టు వేయించుకున్నారని ఎవరికి వారు ఇష్టం వచ్చింది రాసుకొచ్చారు. ఐతే ఈ ఇష్యూ మీద మనుబాకర్ రియాక్ట్ అయింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. నీరజ్‌తో మాట్లాడుతుంటే.. ఎవరో వీడియో తీశారని.. తమ మధ్య అంతగా ఇంటరాక్షన్‌ లేదు.

వివిధ పోటీలు, ఈవెంట్లలో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటామని చెప్పారు. అంతే తప్ప.. ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అబద్ధమని.. నీరజ్‌తో అమ్మకు ఎలాంటి డిస్కషన్ నడిచిందో చెప్పలేను అని మను బాకర్‌ క్లారిటీ ఇచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో మను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది.