MS DHONI: సీజన్ మధ్యలో ధోనీ ఔట్..? విండీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్..

ఈ సీజన్‌లో చెన్నై సారథిగా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన ధోనీ.. ప్లేయర్‌గానే ఆడుతున్నాడు. ఒకవిధంగా సీఎస్కే ఫ్యాన్స్‌కు ఇది కష్టంగానే కనిపించింది. అయితే ధోనీ.. చెన్నై ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇవ్వబోతున్నాడా.. అంటే క్రిస్ గేల్ అవుననే అంటున్నాడు.

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 04:54 PM IST

MS DHONI: ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ అయిపోయింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో బెంగళూరును చిత్తు చేసింది. అయితే ఈ సీజన్‌లో చెన్నై సారథిగా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన ధోనీ.. ప్లేయర్‌గానే ఆడుతున్నాడు. ఒకవిధంగా సీఎస్కే ఫ్యాన్స్‌కు ఇది కష్టంగానే కనిపించింది. అయితే ధోనీ.. చెన్నై ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇవ్వబోతున్నాడా.. అంటే క్రిస్ గేల్ అవుననే అంటున్నాడు.

Sunrisers Hyderabad: కేకేఆర్‌తో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్ బోణీ కొడుతుందా..?

ఈ సీజన్ మొత్తం ధోనీ ఆడకపోవచ్చని వ్యాఖ్యానించాడు. అన్ని మ్యాచ్‌లు ఆడడనీ, లీగ్ మధ్యలో విరామం తీసుకుంటాడని గేల్ చెప్పుకొచ్చాడు. మధ్యలో బ్రేక్ తీసుకునేందుకే సీజన్ ఆరంభంలోనే కెప్టెన్సీని రుతురాజ్‌కు అప్పగించాడంటూ గేల్ విశ్లేషించాడు. నిజానికి ధోనీ సారథ్య బాధ్యతలు వదిలేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సీజన్‌తో కెరీర్ ముగిస్తాడని, ఆ తర్వాత వారసుడిని ప్రకటిస్తాడని భావించారు. అయితే ఎప్పుడూ ఆశ్చర్యపరిచేవిధంగా నిర్ణయాలు తీసుకునే మహి.. మరోసారి అదే ఫాలో అయ్యాడు. అయితే సీజన్ మొత్తం ఆడకుంటే మాత్రం ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ గానే చెప్పాలి.