MS Dhoni: ధోని కూతురు జీవా గురించి వెతికేస్తున్న నెటిజన్స్.. ఏం తెలిసిందంటే..

ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మెయిన్‌స్ట్రీమ్ మీడియాకు దూరమైపోయాడు. అడపాదడపా విమానాల్లో కనిపించడమే తప్ప.. ఎక్కడా కనిపించడం లేదు కూడా. దీంతో అతని ఫ్యాన్స్ అందరూ ధోనీ గురించి, అతని కుటుంబం గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 12:58 PM IST

MS Dhoni: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ మినహా ఏ టోర్నీలోనూ ఆడని ధోనీ.. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాడు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మెయిన్‌స్ట్రీమ్ మీడియాకు దూరమైపోయాడు.

అడపాదడపా విమానాల్లో కనిపించడమే తప్ప.. ఎక్కడా కనిపించడం లేదు కూడా. దీంతో అతని ఫ్యాన్స్ అందరూ ధోనీ గురించి, అతని కుటుంబం గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కుమార్తె జీవా గురించి, ఆమె చదువుకునే స్కూల్ గురించి కూడా నెట్టింట వెతికేస్తున్నారు. జీవా ఎక్కడ చదువుకుంటోంది..? ఆ స్కూల్ ఫీజు ఎంత..? అని ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏ విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండే ధోనీ.. జీవా కేవలం చదువులోనే కాకుండా స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్‌లో కూడా ముందుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

జీవా ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని, ధోనీ సొంత ఊరు రాంచీలోనే చదువుకుంటోంది. ఇక్కడ ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో జీవా మూడో క్లాస్ చదువుతోందని తెలుస్తోంది. ఈ స్కూల్‌లో జీవా చదువు కోసం ధోనీ ఏటా రూ.2.75 లక్షల ఫీజు కడుతున్నట్లు సమాచారం. తన గారాల పట్టి చదువు కోసం ధోనీ ఆ మాత్రం ఖర్చు పెడుతున్నాడంటే ఆశ్చర్యం లేదు అని ‘తల’ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.