Robin Minz: గుజరాత్ వికెట్ కీపర్‌గా సెక్యూరిటీ గార్డు కొడుకు

ఐపీఎల్ వేలంలో జార్ఖండ్ తరపున రాబిన్ మింజీ రూ.20 లక్షల బేస్ ధరతో వేలంలో నిలిచాడు. రాబిన్ మింజీ పేరు వినిపించడంతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలుపై ఆసక్తి చూపింది. ఆ తర్వాత CSK, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేలం వేశాయి.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 04:08 PM IST

Robin Minz: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా చాలా మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని మార్చుకున్నారు. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా, మరికొందరు ఆటగాళ్లు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తున్న మరో యువకెరటం రాబిన్ మింజ్. అతడి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ప్రస్తుతం రాంచీలోని ముండా విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.

David Warner: అన్ బ్లాక్ చేయండి ప్లీజ్.. డేవిడ్ వార్నర్ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్..

ఇప్పుడు తన కొడుకు ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్‌కి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ వేలంలో జార్ఖండ్ తరపున రాబిన్ మింజీ రూ.20 లక్షల బేస్ ధరతో వేలంలో నిలిచాడు. రాబిన్ మింజీ పేరు వినిపించడంతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలుపై ఆసక్తి చూపింది. ఆ తర్వాత CSK, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేలం వేశాయి. దీంతో రూ.20 లక్షలు ఉన్న రాబిన్ మింజ్ నికర విలువ రూ.3 కోట్లు దాటింది. చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.3.6 కోట్లతో దక్కించుకుంది. దీంతో ఈ జార్ఖండ్‌ యువ వికెట్‌ కీపర్‌ కం బ్యాట్స్‌మన్‌ కూడా అవకాశం వస్తే సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. రాబిన్ మింజే 21 ఏళ్ల యువ వికెట్ కీపర్. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మింజ్ క్రికెట్‌పై తన దృష్టిని కేంద్రీకరించాడు.

ఫలితంగా, అతను జులైలో ముంబై ఇండియన్స్ UK పర్యటనకు ఎంపికయ్యాడు. అతడు అండర్ 19, అండర్ 25 జార్ఖండ్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాబిన్ మింజే వీరాభిమాని. ధోనీ వికెట్లు కీపింగ్ చేసే విధానం తనకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. మరి వచ్చిన అవకాశాన్ని ఈ కీపర్ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడో అనేది వేచి చూడాలి.