కోచ్ పదవికి జయసూర్య గుడ్ బై

  • Written By:
  • Publish Date - August 9, 2024 / 04:41 PM IST

టీమిండియాపై వన్డే సిరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. కోచ్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సనత్ జయసూర్య తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఇంగ్లండ్​తో జరిగే సిరీస్ తర్వాత అతడు కోచింగ్ నుంచి తప్పుకొని లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో బిజీ కానున్నాడు. లంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు జయసూర్య తాత్కాలిక కోచ్​గా బాధ్యతలను చేపట్టాడు. కాగా జయసూర్య ఇచ్చిన సూచనల వల్లే టీమిండియాపై శ్రీలంక విజయం సాధించగలిగింది. భారత్​పై గెలవగలమనే భరోసాను ఇచ్చి టీంను ముందుకు నడిపించాడు. ఇది వర్కౌట్ అయ్యి భారత్‌పై శ్రీలంక గెలిచింది. ఇప్పుడు జయసూర్య స్థానంలో లంక బోర్డు కొత్త కోచ్ ను నియమించనుంది.