రాజస్థాన్ కు సంజూ బై..బై హింట్ ఇచ్చిన ఫ్రాంచైజీ

ఐపీఎల్ మెగావేలం ముంగిట కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్షన్ కు ముందే పలువురు కీలక ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడుతున్నాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 05:35 PM IST

ఐపీఎల్ మెగావేలం ముంగిట కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్షన్ కు ముందే పలువురు కీలక ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడుతున్నాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. రాయల్స్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలను బలపరుస్తోంది. సంజూ శాంసన్ వీడియోను షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్ మేజర్ మిస్సింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ఏడుస్తున్న ఎమోజీని కూడా జత చేయడంతో సంజూ రాజస్థాన్ కు బై బై చెబుతున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేల ఈ కేరళ క్రికెటర్ వేలంలోకి వస్తే అతని కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీ పడతాయని చెప్పొచ్చు.

సంజూ శాంస‌న్ 2018 నుంచి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున ఆడుతున్నాడు. 2021 లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. సంజూ సారథ్యంలో రాయల్స్ ఒకసారి ఫైన‌ల్‌కు చేరుకుంది. మొత్తంగా త‌న ఐపీఎల్ కెరీర్‌లో 167 మ్యాచులు ఆడిన సంజూశాంస‌న్ 4419 ప‌రుగులు చేశాడు. దీనిలో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచిన రాజస్థాన్ తర్వాత మళ్ళీ టైటిల్ గెలవలేకపోయింది. కెప్టెన్లను, ఆటగాళ్ళను మార్చినా కప్ సాధించలేదు. దీంతో 2025 సీజన్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా మెగావేలానికి రెడీ అవుతోంది.