నీరజ్ చోప్రా తల్లికి అక్తర్ సెల్యూట్

  • Written By:
  • Publish Date - August 9, 2024 / 06:35 PM IST

పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఈ సారి రజతం సాధించాడు. అనూహ్యంగా
పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఒలింపిక్స్ రికార్డు క్రియేట్ చేయడంతో పాటు స్వర్ణం గెలిచాడు. ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి స్పందించారు. ఆ గోల్డ్ గెలిచిన అబ్బాయి కూడా నా కొడుకే అంటూ వ్యాఖ్యానించారు. ఈ స్థాయికి వచ్చేందుకు అతను కూడా ఎంతో కష్టపడ్డాడంటూ చెప్పారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆమెకు సెల్యూట్ చేశాడు. గోల్డ్ గెలిచిన వ్యక్తి కూడా నా కొడుకే.. ఈ మాట కేవలం ఓ అమ్మ మాత్రమే అనగలదు.. అద్బుతం అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. జావెలిన్ తో నీరజే తనకు స్ఫూర్తి అని అర్షద్ చాలాసార్లు చెప్పాడు. కిందటిసారి నీరజ్ గోల్డ్ గెలవగా.. అర్షద్ ఒట్టి చేతులతో వెళ్లాడు. ఈసారి అదే నీరజ్ ను వెనక్కి నెట్టి గోల్డ్ గెలిచాడు