శ్రేయాస్, సూర్య ఫ్లాప్ షో నిరాశపరిచిన భారత క్రికెటర్లు

టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్ రీఎంట్రీలో నిరాశపరిచారు.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 05:40 PM IST

టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్ రీఎంట్రీలో నిరాశపరిచారు. బుచ్చిబాబు టోర్నీలో ముంబై జట్టుకు ఆడుతున్న వీరిద్దరూ తొలిరోజు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 2 పరుగులే చేసి ఔటవగా… సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ తో 30 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఈ టోర్నీలో రాణించి బంగ్లాతో సిరీస్ కు ముందు సెలక్టర్ల దృష్టిలో పడాలని శ్రేయస్, సూర్యకుమార్ భావించారు. తొలి మ్యాచ్ లోనే విఫలమై నిరాశపరిచారు.