సిరాజ్, రవీంద్ర జడేజా ఔట్ దులీప్ ట్రోఫీకి దూరం

దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తప్పుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 03:55 PM IST

దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ నుంచి స్టార్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తప్పుకున్నారు. తొలి రౌండ్ మ్యాచ్ లకు వీరిద్దరూ దూరమయ్యారు. అనారోగ్యం కారణంగానే సిరాజ్ దులీప్ ట్రోఫీ నుంచి వైదొలిగాడని బీసీసీఐ తెలిపింది. అయితే జడేజా తప్పుకోవడానికి కారణాలు వెల్లడికాలేదు. సిరాజ్ స్థానంలో నవదీప్ సైనీని ఎంపిక చేశారు. ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమ్ సిలో ఉన్నప్పటికీ ఫిట్ నెస్ సాధిస్తేనే ఆడతాడని బోర్డు వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ లు మొదలుకానున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఏ, టీమ్ బి తలపడతాయి. కాగా టీమ్ ఏకు శుభమన్ గిల్, టీమ్ బికు అభిమన్యు ఈశ్వరన్, టీమ్ సికు రుతురాజ్ గైక్వాడ్, టీమ్ డికు శ్రేయాస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నారు.