Smriti Mandhana: స్మృతి మంధాన క్రేజ్ మామూలుగా లేదుగా.. WPLలో ఆర్‌సీబీ ఫాన్స్ రచ్చ రచ్చ

స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ మహిళల జట్టుకు తమ సపోర్ట్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక కోహ్లీ లాగానే స్మృతి మంధానకు ఫాన్స్ సపోర్ట్ ఓ రేంజ్‌లో ఉంది.

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 12:29 PM IST

Smriti Mandhana: ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవకున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇదే తరహాలో వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌కు అభిమానుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ మహిళల జట్టుకు తమ సపోర్ట్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.

Ishan Kishan: దారిలోకి వచ్చిన అయ్యర్, ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ బరిలో యువ క్రికెటర్లు

హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. యూపీ వారియర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు.. తాజాగా గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు అదే తరహాలో మద్దతుగా నిలిచారు. ఇక కోహ్లీ లాగానే స్మృతి మంధానకు ఫాన్స్ సపోర్ట్ ఓ రేంజ్‌లో ఉంది. తాజాగా బెంగుళూరు తన రెండో మ్యాచ్‌లో స్మృతి టాస్ గెలిచిన వెంటనే స్టేడియం దద్దరిల్లేలా గట్టిగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

అభిమానుల మద్దతుకు ఫిదా అయిన స్మృతి మంధాన సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌సీబీ అభిమానులంతా ఫిదా అవుతున్నారు.