Rajinikanth: రజినీ కాంత్‌కు గోల్డెన్ టిక్కెట్.. వరల్డ్ కప్‌కు ఫ్రీ ఎంట్రీ..!

బీసీసీఐ పెద్ద జై షా.. స్వయంగా చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లి మరీ ఈ గోల్డెన్ టికెట్‌ను జైలర్ హీరోకు అందజేశాడు. వరల్డ్ కప్‌ను జనంలోకి తీసుకెళ్లి ఈ మెగా ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గాను బీసీసీఐ, ఐసీసీలు వినూత్నరీతిలో కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - September 19, 2023 / 04:47 PM IST

Rajinikanth: వచ్చేనెల 5 నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకుగాను సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ‘గోల్డెన్ టికెట్’ను అందింది. బీసీసీఐ పెద్ద జై షా.. స్వయంగా చెన్నైలోని రజినీ ఇంటికి వెళ్లి మరీ ఈ గోల్డెన్ టికెట్‌ను జైలర్ హీరోకు అందజేశాడు. వరల్డ్ కప్‌ను జనంలోకి తీసుకెళ్లి ఈ మెగా ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గాను బీసీసీఐ, ఐసీసీలు వినూత్నరీతిలో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జై షా.. ఇదివరకే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కూ ఈ గోల్డెన్ టికెట్లను అందజేశాడు. తాజాగా జై షా.. రజినీకీ ఈ టికెట్‌ను అందజేశాడు.

ఈ గోల్డెన్ టికెట్ అందిన సెలబ్రిటీలు వరల్డ్ కప్ మ్యాచ్‌లను పూర్తి ఉచితంగా వీఐపీ లాంజ్‌లో కూర్చుని చూసే వీలు దక్కుతుంది. అది కూడా ఏ మ్యాచైనా, ఎన్ని మ్యాచులైనా ఉచితంగా చూడొచ్చు. రజినీకి గోల్డెన్ టికెట్ ఇచ్చిన తర్వాత బీసీసీఐ అధికార ట్విట్టర్‌లో, జైషా వ్యక్తిగత ట్విట్టర్‌లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. క్రికెట్ అభిమాని అయిన తలైవాకు వన్డే వరల్డ్ కప్ చూసేందుకు స్వాగతమని జై షా ట్వీట్‌లో పేర్కొన్నాడు.