MS DHONI: ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా..? రైనా ఏమన్నాడంటే..

ఇప్పటికే చాలా సార్లు ఇదే ధోనీ చివరి ఐపీఎల్‌ సీజన్‌ అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌లో కనిపిస్తున్న సంకేతాలతో చాలా మంది ఫ్యాన్స్‌ మహీకి ఇదే లాస్ట్‌ ఐపీఎల్‌ సీజన్‌ అని భావిస్తున్నారు. అయితే తాజాగా రైనా చేసిన వ్యాఖ్యలు ధోనీ ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - April 19, 2024 / 05:02 PM IST

MS DHONI: భారత్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 42 ఏళ్ల వయస్సులోనూ మహీ సిక్సులు బాదుతుంటే స్టేడియం ఊగిపోతోంది. ప్రత్యేకంగా అతడి బ్యాటింగ్‌ చూసేందుకు ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అతడు బ్యాటుతో గ్రౌండులోకి అడుగు పెట్టగానే స్టేడియం అభిమానుల కేకలతో హోరెత్తుతోంది.

Mansoor Ali Khan: తమిళ నటుడిపై విష ప్రయోగం జరిగిందా.. ఇప్పుడెలా ఉన్నాడు..?

ఇప్పటికే చాలా సార్లు ఇదే ధోనీ చివరి ఐపీఎల్‌ సీజన్‌ అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌లో కనిపిస్తున్న సంకేతాలతో చాలా మంది ఫ్యాన్స్‌ మహీకి ఇదే లాస్ట్‌ ఐపీఎల్‌ సీజన్‌ అని భావిస్తున్నారు. అయితే తాజాగా రైనా చేసిన వ్యాఖ్యలు ధోనీ ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ధోనీ వచ్చే సీజన్ ఆడతాడని రైనా సూటిగా ఒక్క మాటలో సమాధానం ఇచ్చాడు. ధోనీకి సన్నిహిత మిత్రుడు అయిన భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా మహీ మరో సీజన్‌ ఆడుతాడని అభిప్రాయ పడ్డాడు. ఇది మహీ చివరి సీజన్‌గా అనిపించడం లేదన్నాడు.

దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సీజన్‌లో ధోనీ కేవలం 25 బంతులు మాత్రమే ఆడాడు. కానీ 236.00 స్ట్రైక్‌ రేటుతో అదరగొట్టాడు. అయినప్పటికీ అతడు మైదానంలో మోకాలి నొప్పితో బాధ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎడమ మోకాలికి బ్లాక్‌ బ్యాండ్‌ను చుట్టుకుని కనిపిస్తున్నాడు. దీంతో ధోనీ ఫిట్‌నెస్‌పై ఫాన్స్‌కు ఆందోళన మొదలయింది.