Team India : న్యూయార్క్ లో టీమిండియా

టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ జూన్‌ 1 మొదలుకానుంది.

 

 

టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ జూన్‌ 1 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా సోమవారం న్యూయార్క్‌లో ల్యాండ్‌ అయింది. ఫస్ట్ బ్యాచ్ లో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శుబ్‌మన్‌ గిల్‌, కుల్దీప్‌‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ న్యూయార్క్‌లో అడుగుపెట్టినట్లు తెలుపుతూ బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. కాగా మిగిలిన ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌, యజువేంద్ర చహల్‌, రింకూ సింగ్ రెండో బ్యాచ్‌లో అమెరికాకు పయనం కానున్నారు. మెగా టోర్నీకి ముందు భారత్ బంగ్లాదేశ్‌తో జూన్‌ 1 వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.