నువ్వేమైనా మలింగానా..? షకీబ్ గాలి తీసేసిన కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే... ఆటలోనే కాదు ప్రత్యర్థుల స్లెడ్జింగ్ కు ధీటుగా బదులిస్తుంటాడు... ఒక్కోసారి వారిపై సెటైర్లు కూడా వేస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - September 21, 2024 / 08:39 PM IST

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే… ఆటలోనే కాదు ప్రత్యర్థుల స్లెడ్జింగ్ కు ధీటుగా బదులిస్తుంటాడు… ఒక్కోసారి వారిపై సెటైర్లు కూడా వేస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ అల్ హసన్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. నువ్వేమైనా మలింగా అనుకుంటున్నావా.. యార్కర్ల మీద యార్కర్లు వేస్తున్నావు అంటూ షకీబ్ ను టీజ్ చేశాడు. అంతకుముందు ఓవర్ బౌలింగ్ చేసినప్పుడు షకీబ్ కోహ్లీకి వరుసగా యార్కర్లు వేశాడు. దీనిని గుర్తు చేస్తూ కోహ్లీ ఇలా కామెంట్ చేయడంతో షకీబ్ తెల్లమొహం వేశాడు. దీంతో కోహ్లీ కామెడీ టైమింగ్ అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.