Wazhma Ayoubi: భారత జెర్సీలో ఆఫ్ఘనిస్తాన్ బ్యూటీ..!

ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ వాజ్మా అయూబీ భారత్‌కు జై కొట్టింది. హై-ఆక్టేన్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. "నా సెకండ్ హోమ్ టీమ్‌కు శుభాకాంక్షలు.." అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 05:45 PM IST

Wazhma Ayoubi: ఆసియా కప్‌ -2023లో భాగంగా సూపర్‌-4 దశలో భారత్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవటంతో స్కోర్ బోర్డు కాస్త మందగించింది. ఇక వర్షం అంతరాయం కలిగించడంతో.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఆటను తదుపరి రోజుకు వాయిదా వేశారు.

ఇదిలావుంటే ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ వాజ్మా అయూబీ భారత్‌కు జై కొట్టింది. హై-ఆక్టేన్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. “నా సెకండ్ హోమ్ టీమ్‌కు శుభాకాంక్షలు..” అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఆడే పలు మ్యాచ్‌లకు అయూబీ హాజరైంది. ఈ అమ్మడు చేసిన ట్వీట్.. పాకిస్తాన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతిస్తున్నారు.