Chris Gayle: ఆడేటప్పుడు తీపి ఇప్పుడు చేదు గేల్ కోపంలో అర్థమెంత?

ప్రస్తుతం క్రికెట్​ ఒక బిజినెస్​గా మారిపోయిందని విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ అన్నాడు. జెంటిల్మన్ గేమ్​లో మూడు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని.. ఇది మంచిది కాదన్నాడు.

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 05:55 PM IST

ఒకప్పుడు జెంటిల్మన్ గేమ్​లో అంతగా డబ్బు ఉండేది కాదు. కానీ గత 15 ఏళ్ల నుంచి క్రికెట్​ కూడా క్యాష్ రిచ్​ గేమ్​లా మారిపోయింది. ముఖ్యంగా లీగ్​ల ఆరంభంతో కాసుల వర్షం కురుస్తోంది. అటు బోర్డులతో పాటు ఇటు ప్లేయర్లు కూడా ధనార్జనలో దూసుకెళ్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణతో భారత క్రికెట్ బోర్డు ప్రపంచ క్రికెట్​లో అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. దీంతో పాటు క్రికెటింగ్ కంట్రీస్​లో టీమిండియాకు ఉన్న ఫేమ్, మన స్టార్‌‌ ప్లేయర్లకు ఉన్న క్రేజ్ తదితరాలు కూడా బోర్డుకు కలిసొస్తున్నాయి. ప్రసార హక్కులు, స్పాన్సర్​షిప్​లతో ఆదాయ పరంగా బీసీసీఐ పంట పండుతోంది. అందుకే ఐసీసీలో మన బోర్డు హవా నడుస్తోంది. భారత్​తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు కూడా పటిష్టమైన బోర్డులే. ధనార్జనతో పాటు ఈ మూడు జట్లు.. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో టాప్ టీమ్స్​గా ఉన్నాయి.

ఈమధ్య కాలంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఎక్కువగా దైపాక్షిక సిరీస్​లు జరుగుతున్నాయి. వీటికి ఆడియెన్స్​ నుంచి ఆదరణ ఎక్కువగా ఉండటంతో బోర్డులు వరుస సిరీస్​లు నిర్వహిస్తున్నాయి. అయితే ఇది చాలా తప్పు అని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ అన్నాడు. ఇండియా, ఇంగ్లండ్, ఆసీస్ కలసి క్రికెట్​ను నాశనం చేస్తున్నాయని అతడు విమర్శించాడు. గత కొన్నేళ్లలో క్రికెట్ ఎంతగానో మారిపోయిందన్న గేల్.. ఇప్పుడు ఇదో బిజినెస్​గా మారిందన్నాడు. టీ20 లీగ్​లతో పాటు టెస్టుల్లోనూ చాలా డబ్బు వస్తుండటంతో చిన్న జట్ల కంటే పెద్ద దేశాలే ఎక్కువ ఆదాయం పొందుతున్నాయని చెప్పుకొచ్చాడు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఎక్కువగా టెస్టులు ఆడుతున్నాయని.. ఈ మూడు జట్లే ఆధిపత్యం చెలాయించడం సరికాదన్నాడు గేల్. దీర్ఘకాలంలో ఇది క్రికెట్​కు అస్సలు మంచిది కాదని హెచ్చరించాడు.